శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారిగా కే స్వరూప రాణిని ప్రభుత్వం నియమించింది. మంగళవారం జారీ అయిన ఆదేశాల మేరకు ఆమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉపాధి హామీ పథకం ఫైనాన్స్ మేనేజర్ గా పనిచేసిన అనుభవం తనకు ఉందని, తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని ఆమె తెలిపారు.