శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. అమృత్ భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం సందర్భంగా, జిల్లాలో రైల్వే పనులను వేగవంతం చేస్తామని, శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతి, హైదరాబాద్కు రైళ్లు నడిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇది తన కల అని, దీనితో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.