ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర బడ్జెట్పై ప్రశంసలు కురిపించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ దేశాభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన అన్నారు. విదేశీ యాత్రలపై పన్ను తగ్గింపు, పౌర విమానయాన రంగానికి సహకారం అందించడం ఆనందదాయకమని కింజరాపు పేర్కొన్నారు.