బుధవారం ఆమదాలవలస పట్టణంలోని అన్నా క్యాంటీన్ను టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ పరిశీలించారు. క్యాంటీన్లో భోజన నాణ్యత, పరిశుభ్రత, సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పేదలకు, కార్మికులకు తక్కువ ధరకు భోజనం అందించడం అభినందనీయమని, భవిష్యత్తులో మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాతిన రమణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.