శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న ఘటన వెలుగుచూసింది. సెల్ఫోన్లో మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఉపాధ్యాయురాలు సుజాత తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించారు.