శ్రీకాకుళంలోని అరసవల్లిలో సూర్యదేవుని ఏకైక క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హంసవాహనంపై స్వామివారిని అలంకరించి ఇంద్రపుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గొండు శంకర్, ఆలయ ఈవో, అర్చకులు ఇప్పిలి శంకరశర్మ పాల్గొన్నారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. శ్రీకూర్మంలోనూ తెప్పోత్సవం భక్తుల ఉత్సాహంతో వైభవంగా జరిగింది.