శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి నందగిరి పేటలో పాతిన బుదమ్మ మెడలో 32 గ్రాముల చైన్ దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం చెప్పారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. జనవరి 30 ఉదయం 5 గంటలకు ఈ చోరీ చేశారన్నారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు దొంగలను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు.