శ్రీకాకుళం జిల్లాలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. శ్రీకాకుళం నగరం నుంచి అరసవల్లి, శ్రీకూర్మం వెళ్లే వాహనాలను పెద్దపాడు మీదుగా గార రోడ్డుకు మళ్లించారు. గార నుంచి వచ్చే వాహనాలు కూడా పెద్దపాడు మీదుగా నగరంలోకి ప్రవేశించాలని సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు.