దివ్యాంగుడు నెయ్యల ప్రసాదరావు చేపట్టిన ట్రై సైకిల్ యాత్ర దిగ్విజయంగా నిర్వహించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి శ్రీకాకుళంలో ప్రసాద్ను పలకరించిన మంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ట్రై సైకిల్పై వస్తానని మొక్కకున్న ప్రసాద్కు తన సహకారం ఉంటుందని తెలిపారు.