సెప్టెంబరు 7న శ్రీవారి ఆలయం మూసివేత

17873చూసినవారు
సెప్టెంబరు 7న శ్రీవారి ఆలయం మూసివేత
AP: సెప్టెంబరు 7న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం దాదాపు 12 గంటలపాటు మూసివేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. అదే రోజున భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో 30వేల పులిహోర ప్యాకెట్లు సిద్ధం చేసి సాయంత్రం నుంచి పంపిణీ చేయనున్నారు. వీటిని వైభోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాలు, సేవా సదన్ వద్ద అందించనున్నారు. సెప్టెంబరు 8న ఉదయం 8.30 గంటలకు అన్నప్రసాదాల పంపిణీ పునః ప్రారంభించనున్నట్టు టీటీడీ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్