తమిళనాడుకు చెందిన ప్రముఖ చిత్ర దర్శకుడు సి.సుందర్ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మదురై సెంట్రల్ నియోజక వర్గం నుంచి సుందర్ పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పుతియ నీతి కట్చి పార్టీ అభ్యర్థిగా ఆయన ఎలక్షన్స్ బరిలో నిలవనున్నారు. ఈ విషయాన్ని పీఎన్కే వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసీ షణ్ముగం ప్రకటించారు.