పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు, హర్మూజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. దీని ప్రభావంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) అమ్మకాలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 931.25 పాయింట్లు నష్టపోయి 76,631.65 వద్ద, నిఫ్టీ 222.25 పాయింట్లు నష్టపోయి 23,775.10 వద్ద ముగిశాయి. ఇండిగో, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి స్టాక్స్ నష్టపోగా, బీఈఎల్, టీసీఎస్ వంటివి లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 92.62గా ఉంది.