హరిద్వార్లోని పథరీ ప్రాంతంలో జరిగిన రాళ్లదాడి ఘటన తర్వాత పోలీసులు డ్రోన్ల సహాయంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఈ డ్రోన్ విజువల్స్లో పలు ఇళ్లపై ఇటుకలు, రాళ్ల కుప్పలు భారీగా కనిపించాయి. ఈ ఉద్రిక్తతలకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన అనుమానితులను గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.