ఆంధ్రప్రదేశ్లో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తీరప్రాంత జిల్లాలకు అప్రమత్తత జారీ చేసిన ప్రభుత్వం, భద్రతా చర్యగా రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవులు ప్రకటించింది. తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే కాకినాడ జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 31 వరకు హాలిడేలు ఇచ్చారు. అయితే అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కర్నూలు, తిరుపతి, శ్రీకాళహస్తి జిల్లాల్లో ఇప్పటివరకు సెలవులు ఇవ్వలేదు.