ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 12వ తరగతి విద్యార్థి బహిరంగంగా తన టీచర్పై లైంగిక దాడికి పాల్పడి, ఆమె పెదవిని కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు నిందితుడైన విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గతంలో కూడా ఈ విద్యార్థి టీచర్ను వేధించినట్లు, తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని పోలీసులు తెలిపారు.