కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం, చాపాడు మండలం, ఎన్. ఓబాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను అధికారులు పట్టించుకోకపోవడంతో, విసిగిపోయిన విద్యార్థులు, మహిళలు బురదలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. తమ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.