తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని

4739చూసినవారు
తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి సురేశ్ బత్తిని నియమితులయ్యారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న మోరంపూడి అనిల్ కుమార్ స్థానంలో సురేశ్ బత్తిని బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలుగు అధికారికి మరోసారి ఈ అత్యున్నత పదవి దక్కడం విశేషం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్