తన్మయ్ శతకం.. కరీంనగర్ డైమండ్స్ విజయం

7788చూసినవారు
తన్మయ్ శతకం.. కరీంనగర్ డైమండ్స్ విజయం
టీజీ20 2026లో కరీంనగర్ డైమండ్స్ తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. వరంగల్ వారియర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రెండు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, కరీంనగర్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 61 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లతో 133 పరుగులు చేసి అదరగొట్టాడు. లక్ష్య ఛేదనలో వరంగల్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 207 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సంబంధిత పోస్ట్