AP: తెలుగుదేశం పార్టీ స్థాపించబడి నేటికి 44 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించనుంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి ప్రధాన ప్రాంతీయ పార్టీగా టీడీపీ గుర్తింపు పొందింది.