అనంతపురం జిల్లాలో అరటి రైతులు పంటను రోడ్డున పారబోసుకున్న దుస్థితి నెలకొంది. అయితే, ఇదే జిల్లాలోని రామినేపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి 15 ఎకరాల్లో దానిమ్మ పంటతో ఈ ఏడాది రూ.2 కోట్ల ఆదాయం సాధించి ఆదర్శంగా నిలిచారు. గత ఏడాది రూ.50-60 వేలు ఉన్న దానిమ్మ టన్ను ధర ప్రస్తుతం రూ.2 లక్షలకు చేరడంతో ఇతర రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.