గువాహటిలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముంబై ఇండియన్స్ బౌలర్లను, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను తనదైన శైలిలో ఎదుర్కొన్నాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు, ఇందులో ఒక ఫోర్, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అతను బుమ్రా వేసిన తొలి బంతిని సిక్సర్గా మలచడమే కాకుండా, నాలుగో బంతిని కూడా స్టాండ్స్లోకి పంపాడు. ఆ తర్వాత బౌల్ట్, శార్దూల్ ఠాకూర్లను కూడా ఇబ్బంది పెట్టిన వైభవ్, భారీ షాట్కు యత్నించి తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.