AP: ఇటీవల కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో గణనీయంగా మార్పులు వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు. నల్లజర్లలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో ఎక్కువగా జొన్నలు, రాగులు తినేవారని.. వారిలో షుగర్ జబ్బు కనిపించేది కాదని చెప్పారు. వరి అన్నం తినేవారికి తొందరగా షుగర్ వస్తోందని చెప్పారు. అందుకే రైస్ తినేవారి సంఖ్య తగ్గిందన్నారు. తాను కూడా అన్నం తినడం మానేశానని తెలిపారు.