AP: కూటమి ప్రభుత్వం తెలుగు అకాడమీని లూటీ చేస్తోందని
వైసీపీ మహిళా నేత నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్, గతంలో అర్హత లేక తిరస్కరణకు గురైన వీజీఎస్, విక్రం వంటి సంస్థలతో కుమ్మక్కై, నిబంధనలు మార్చి టెండర్లు కట్టబెట్టారని ఆమె ఆరోపించారు. ఈ సంస్థలు అకాడమీ సిలబస్ పీడీఎఫ్ లను నేరుగా ప్రైవేట్ కాలేజీలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయని లక్ష్మీపార్వతి తెలిపారు.