రాష్ట్రంలోని కాపులు అమాయకులు కాదు: MLC హరిప్రసాద్

516చూసినవారు
AP: జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, వైసీపీ నేతల మాటలు విని మోసపోవడానికి రాష్ట్రంలోని కాపులు అమాయకులు కాదని అన్నారు. సోమవారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో కాపులంతా జనసేనకు ఓట్లు వేశారని, దీనితో వైసీపీ కాపులను జనసేనకు దూరం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సంబంధం లేని విషయాలను పవన్ కళ్యాణ్‌కు అంటగట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్