AP: పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీశ్ కుమార్ది హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ఫోరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో వైద్యులు మృతదేహానికి సిటీ స్కాన్ చేశారు. సతీశ్ తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లు వైద్యులు గుర్తించారు. దర్యాప్తు జరుపుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.