వచ్చేది జగన్‌ ప్రభుత్వమే: అంబటి రాంబాబు

25చూసినవారు
వచ్చేది జగన్‌ ప్రభుత్వమే: అంబటి రాంబాబు
AP: కడప జిల్లా, వేంపల్లి పీఎస్‌లో మంత్రి అంబటి రాంబాబు విచారణ రెండు గంటలపాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే అంశంపై చట్టవిరుద్ధంగా 36 కేసులు పెట్టారని, లోకేష్ ఆదేశాలతో కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము వైఎస్సార్ వారసులమని, ఎవరికీ భయపడేది లేదని, వచ్చేది జగన్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చట్టవ్యతిరేకంగా పనిచేసే పోలీసు అధికారులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :