అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధర గురువారం ఒక్కసారిగా తీవ్ర ఊగిసలాటకు లోనైంది. కేవలం ఒక ట్రేడింగ్ సెషన్లోనే పసిడి మార్కెట్ విలువ మొత్తం 5.5 ట్రిలియన్ డాలర్ల మేర ఆవిరైంది. ఈస్ట్రన్ టైమ్ ప్రకారం ఉదయం 9.30 నుంచి 10.25 గంటల మధ్య బంగారం విలువ 3.2 ట్రిలియన్ డాలర్లు తగ్గింది. అయితే ఆ తర్వాత మార్కెట్ ముగిసేలోపు 2.3 ట్రిలియన్ డాలర్లకు పైగా తిరిగి పుంజుకుంది. ఈ స్థాయి మార్పులు చరిత్రలో తొలిసారి చోటుచేసుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.