AP: నెల్లూరు జిల్లా రాళ్లపాడులో జరిగిన దాడిలో గాయపడిన ఇద్దరు యువకులు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఆదివారం మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నెల్లూరులో జరిగింది ఒక మారణకాండంగా చెప్పవచ్చు. పేద కుటుంబంలో పుట్టిన ముగ్గురు మీద ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారు. ప్రమాదమని ఒక చిన్న కేసు నమోదు చేసినట్లు తెలిసింది’ అని అన్నారు.