ఏపీ EAPCET ఫలితాల్లో ఇంజినీరింగ్, అగ్రి&ఫార్మసీ విభాగాల్లో టాప్ ర్యాంకులను బాలురే కైవసం చేసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో గుంటూరు జిల్లా, తాడేపల్లికి చెందిన రోషన్ మణిదీప్ 95.69 స్కోర్తో మొదటి ర్యాంకు సాధించగా, అగ్రి&ఫార్మసీ విభాగంలో విజయనగరం జిల్లా, బొబ్బిలికి చెందిన శంబంగి జశ్వంత్ 92.53 స్కోర్తో అగ్రస్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో ఇంజినీరింగ్లో ఒకరికి, అగ్రి&ఫార్మసీలో ఐదుగురికి టాప్-10లోపు ర్యాంకులు వచ్చాయి.