తమిళనాడులో నటుడు విజయ్ ముఖ్యమంత్రి కావాలని నటుడు పోసాని కృష్ణమురళి ఆకాంక్షించారు. విజయ్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆయన హుందాగా వ్యవహరించారని, ఎప్పుడూ ఒక్క మాట కూడా జారలేదని తెలిపారు. ఏపీ రాజకీయాలపై పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ, తాను ఏ తప్పూ చేయలేదని, ఒక్క రూపాయి కూడా మోసం చేయలేదని, తనను జెంటిల్మన్లా కాకుండా డాబర్మన్లా చూపిస్తున్నారని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు.