AP: తన కులదైవం వేంకటేశ్వర స్వామిని బజారుకు ఈడ్చే ప్రయత్నం జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ వేసింది తానేనని, NDDB నివేదికపైనే మాట్లాడానని ఆయన తెలిపారు. స్వామివారి పట్ల మహా పాపం చేసి, తనపైనే ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తిరిగి తననే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.