AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మంత్రి అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఎన్టీఆర్ కుమార్తె, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురించి అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడించారో అప్పుడే వైసీపీ పతనం మొదలైందని తెలిపారు. చంద్రబాబు నాయుడుని 53 రోజులు జైల్లో పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పెంచిన పింఛన్ ఇవ్వడానికి 5 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు.