AP: సంపద సృష్టించని వారికి సంక్షేమం అందించే అధికారం లేదని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. అప్పులు చేసి సంక్షేమం అందించడం సరికాదని, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేశం, రాష్ట్రం ముఖ్యమని తెలిపారు. దీర్ఘకాల సంస్కరణలను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. గతంలో 4 టైర్ల పన్నుల వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు 2 శ్లాబులతో (5, 18 శాతం) సరళతరం చేశారని తెలిపారు. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకోవాలని సూచించారు.