ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్లు ఆడొద్దని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపానికి గురైన ముగ్గురు బాలికలు భారత్ సిటీలోని 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు కాదని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.