యూపీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ కొరియన్ గేమ్ కారణంగా ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మృతుల గదిలో పోలీసులకు లభించిన డైరీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 'సారీ నాన్న.. నన్ను క్షమించండి. డైరీలో రాసినవి అన్నీ చదవండి. ఎందుకంటే.. ఇవి నిజాలు కాబట్టి. ఇప్పుడే చదవండి నాన్న' అని డైరీలో రాసి ఉంది. దీంతో ఈ ఘటనలో మరేదో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.