ఏపీ హైకోర్టులో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టనున్నారు. గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ను పదోన్నతిపై న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. వీరి నియామకంతో ఏపీ హైకోర్టులో జడ్జీల సంఖ్య 35కు పెరగనుంది.