ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.