చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కు మొత్తం 231 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూ క్లినిక్ కు అత్యధికంగా 188 ఫిర్యాదులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న వినతులను సత్వరమే పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.