కుక్కలు, డ్రైనేజీ సమస్యలపై కార్పొరేటర్ దృష్టికి తెచ్చిన ప్రజలు

963చూసినవారు
కుక్కలు, డ్రైనేజీ సమస్యలపై కార్పొరేటర్ దృష్టికి తెచ్చిన ప్రజలు
చిత్తూరు నగరంలోని టెలిఫోన్ కాలనీలో గురు బేకరీ ఎదురువీధిలో కుక్కల బెడద, డ్రైనేజీ సమస్యలు, దోమల బెడద వంటి సమస్యలను స్థానిక ప్రజలు 31వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. గత 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని పనులను కార్పొరేటర్ అయిన తర్వాత చేశారని ప్రజలు అభినందించారు. తమ వీధిలోని సమస్యలను కూడా పరిష్కరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్