బుధవారం జీడి నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలం, బొమ్మయపల్లి గ్రామపంచాయతీతో పాటు ఎస్.ఆర్.పురం మండలంలో వడగళ్ల వర్షం కురిసింది. తీవ్రమైన ఎండల మధ్య ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురవడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందినట్లు తెలిపారు. ఈ అకస్మాత్తు వర్షం వల్ల వాతావరణం చల్లబడిందని గ్రామస్తులు పేర్కొన్నారు.