శ్రీరంగరాజపురం మండలం, కోటర్లకు చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు సోమవారం చిత్తూరులోని పిజిఆర్ఎస్ లో అధికారులకు తన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారు. 26 సంవత్సరాలుగా తాను సాగు చేసుకుంటున్న రెండు ఎకరాల భూమిని రామకృష్ణాపురం చెందిన వ్యక్తి ఆక్రమించుకున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారులు స్పందించి తన భూమిని తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు.