కుప్పం పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో సమీప దుకాణదారులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదం కారణంగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.