కుప్పం పట్టణంలో శనివారం అర్ధరాత్రి ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. హెచ్పీ పెట్రోల్ బంక్ రోడ్డులో నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి తిరగడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పట్టణంలో కలకలం రేపింది.