పలమనేరు పరిధిలోని కృష్ణమూర్తి గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఖాళీ సిలిండర్లను అధికారులు గురువారం భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్ర మునస్వామి వీధిలో ఉన్న ఈ గోడౌన్లో సిలిండర్లు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.