మాజి సైనిక ఉద్యోగి మృతుని సంతానానికి ఊరట ఏది?

1649చూసినవారు
మాజి సైనిక ఉద్యోగి మృతుని సంతానానికి ఊరట ఏది?
పలమనేరు మండలంలోని కొలమాసనపల్లికి చెందిన ఒక మాజీ సైనికుడికి చెందిన భూమిని, ఆయన మరణానంతరం అతని సంతానానికి ఇవ్వకుండా ఇతరులకు కట్టబెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విఆర్ఓ నుండి ఆర్డీఓ వరకు అధికారులు లంచం తీసుకున్నారని, దేశ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని బాధితులు గోవిందప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ ఓ ఆర్ అప్పీల్ వరకు వెళ్లినా న్యాయం జరగలేదని, ఇది దేశ సైనికులకు ఇచ్చే గౌరవమా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై అధికారులపై ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్