పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలంలోని ముత్తుకూరు పంచాయతీ, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సి. వి. దామోదర్ రెడ్డి ప్రమాదంలో గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, పలమనేరు మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, దామోదర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. పార్టీతో పాటు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.