పలమనేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 220 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా పలమనేరు అర్బన్, పలమనేరు రూరల్, గంగవరం, బైరెడ్డిపల్లి మండలాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని డీఈఈ జీవన్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.