స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ పలమనేరులో ప్లాంట్ పనుల పరిశీలన

514చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్. పర్వీనా బాను ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పనులను శనివారం పరిశీలించారు. కంపోస్ట్ యార్డ్, తడి చెత్త నుండి ఎరువు తయారీ కేంద్రం, MRF షెడ్, మరియు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం సేకరించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఈ పర్యటనలో మునిసిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. సురేష్ బాబు, మేనేజర్ ఎస్.ఎం. ఖాదర్ మొహిద్దీన్, అసిస్టెంట్ ఇంజనీర్ శిరీష, శానిటరీ ఇన్స్పెక్టర్ బాబు రెడ్డి నాయక్, మరియు శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్