పలమనేరు నియోజకవర్గంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అన్న వితరణ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని భోజనం అందించారు.