పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, భీరప్ప చెరువులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ఎస్సై జయశ్రీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన, విద్య యొక్క ప్రాముఖ్యత వంటి అంశాలపై ఆమె వివరించారు.